ప్లీజ్ నిజాలు తెలియకుండా మాట్లాడొద్దు.. విడాకుల ఇష్యూపై Charu Asopa సీరియస్

by Disha Web Desk 6 |
ప్లీజ్ నిజాలు తెలియకుండా మాట్లాడొద్దు.. విడాకుల ఇష్యూపై Charu Asopa సీరియస్
X

దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటి చారు అసోపా భర్త రాజీవ్‌‌సేన్‌తో విడాకుల ఇష్యూపై ఓపెన్ అయింది. ఇటీవల తమ డైవోర్స్ గురించి తమకంటే ఎక్కువ డిస్కస్ చేస్తున్న జనాలు.. ద్వేష పూరితమైన కామెంట్స్‌తో మానసికంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అతనితో విడిపోవాలనే నిర్ణయంపై అభిమానుల నుంచి ప్రతికూల స్పందనలు వచ్చాయన్న ఆమె.. తాను భర్తను వద్దనుకున్నప్పటికీ కూతురు జియాతో రాజీవ్ ఇంకా విడిపోలేదని, దాని గురించి పునరాలోచనలు చేస్తున్నట్లు తెలిపింది.

అలాగే తమ జీవితంలో జరిగే విషయాల్లో నిజానిజాలేంటో తెలుసుకోకుండా ట్రోలింగ్ చేయడాన్ని 'చెత్త'గా అభివర్ణంచిన ఆమె.. ఇప్పుడు కూతురు కోసమే బతికున్నానని, లేకపోతే ఏమైపోయేదాన్నో అంటూ ఎమోనల్ అయింది. ఇక జియా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా రాజీవ్ పట్టించుకోలేదన్న చారు అసోపా.. ప్రస్తుతం తన సోదరుడి ఇంట్లో ఉంటున్నట్లు తెలిపింది. ఇక ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2019లో వివాహం చేసుకోగా 2021లో బిడ్డకు జన్మనిచ్చారు.

Also Read: అక్క బాయ్ ఫ్రెండ్‌తోనే చెల్లి డేటింగ్.. స్పెషల్ ఏంటో చెప్పాలంటున్న ఫాన్స్

రణ్‌బీర్ నీ భార్యను వదిలెయ్.. అలియా బాడీపై ట్రోలింగ్



Next Story

Most Viewed